Monday 26 May 2014

ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి కథ సిద్ధమవుతోంది. గతంలో ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. రాయలసీమ విప్లవ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22 న షూటింగు మొదలెడతారని సమాచారం. సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు. దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు. http://aptopnews.com/life-and-style/647-150

Sunday 25 May 2014

ఎవరెస్ట్ ఎక్కిన తెలుగుతేజాలు

ఇద్దరు పల్లెటూరి చిన్నారులు.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. ఆ ఇద్దరూ తెలుగుతేజాలు.. అదీ తెలంగాణా గడ్డ మీద పుట్టిన చిన్నారులు కావడం గర్వకారణం. ఆదివారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రాన ఈ ఇద్దరు చిన్నారులు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలావత్ పూర్ణ స్వేరోస్ ఎవరెస్ట్ అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలు. ఈ బాలిక తల్లిదండ్రులు లక్ష్మి, దేవదాస్. 14 ఏళ్ల పూర్ణ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతోంది. అలాగే ఖమ్మం జిల్లాచర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్ కుమార్ కూడా ఈ టీములో ఎవరెస్ట్ మీద అడుగు పెట్టాడు. 17 ఏళ్ల ఆనంద్ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్ కాలేజీలో ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిన్నారులను ఎవరెస్ట్ యాత్రకు తీసుకువెళ్లింది. ప్రముఖ పర్వతారోహకుడు శేఖర్ బాబు పర్యవేక్షణలో ఈ ఇద్దరూ యాత్రను దిగ్విజయంగా కొనసాగించారు. సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించిన తెలంగాణా ముద్దుబిడ్డలకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.http://aptopnews.com/telangana-news/642-2014-05-25-07-04-20

ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి కథ సిద్ధమవుతోంది. గతంలో ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. రాయలసీమ విప్లవ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22 న షూటింగు మొదలెడతారని సమాచారం. 
సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీతరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు. దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు. ఈ విప్లవ యోధుడి కథకు సినిమా తళుకులు అద్దుతున్నారు పరుచూరి బ్రదర్స్. సో.. ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ లో చిరు హంగామా మళ్లీ మొదలవుతుందన్న మాట!http://aptopnews.com/life-and-style/647-150

Tuesday 20 May 2014

బెజవాడే కొత్త రాజధాని?

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం బెజవాడేనా..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బెజవాడకే ఓటేశారా..? ఆ పార్టీలోని సీనియర్ నేతలు విజయవాడ కోసం జోరుగా లాబీయింగ్ మొదలెట్టారా..? ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలు అవుననే అంటున్నాయి. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. గుంటూరు, విజయవాడల మధ్య భవిష్యత్తు సింగపూరుకు పునాది వేస్తే తెలుగుదేశం పార్టీకి ఇక ఢోకా ఉండబోదన్నది ఆలోచన. ఈ రెండు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం వస్తుంది. ఈ ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు సైకిల్ స్పీడుకు దోహదపడ్డాయి. అయితే కొత్త రాజధాని నిర్మాణానికి ఇంకా టైమ్ ఉన్నందున బెజవాడ ప్రతిపాదనపై చంద్రబాబు సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. సీమాంధ్రను సింగపూర్ గా మారుస్తామన్న హామీతో ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని తెర మీదకు తెస్తారు. అయితే రాజధాని ఎంపికపై ఇప్పటికే కేంద్ర బృందం పర్యటనలు జరుపుతోంది. ఏడెనిమిది ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలను అధికార బృందం పరిశీలన జరుపుతోంది.http://www.aptopnews.com/

‘ఆప్’ ఆమ్కే హై కౌన్!


చెడపకురా చెడేవు అన్న సామెతలా తయారైంది ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువంటూ పార్టీ ఆరంభించారు. అవినీతిపైనే తమ పోరాటమన్నారు. చివరికి బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల పోరాటం సాగించారు కేజ్రీవాల్. ముఖ్యంగా బీజేపీ ప్రధాని కేండిడేట్ గా నరేంద్ర మోడీ బరిలోకి దిగిన వారణాసి నుంచే కేజ్రీవాల్ పోటీ చేయడం ఏదో మతలబుందనిపించింది. మోడీపై పోటీ చేస్తే బాగా ప్రచారం జరుగుతుందన్న ఆలోచన ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలిగారు. కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో స్పాయిల్ స్పోర్ట్స్ ఆడారన్న విమర్శ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో థర్డ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేయడం.. 49 రోజుల్లోనే జెండా ఎత్తేయడం కేజ్రీవాల్ టీమ్ ను వీక్ చేసింది. కనీసం 20 పార్లమెంటు సీట్లైయినా వస్తాయన్న ఊహాగానాలునడిచాయి. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి నామమాత్రమే అని తేలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన ఘనత కచ్చితంగా కేజ్రీవాల్ దే. నిజంగానే యువత అవినీతికి వ్యతిరేకంగా కదిలారు. ఓటింగులోనూ పాల్గొన్నారు. కానీ ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్ కు పడకుండా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఖాతాకు జమయ్యాయి. జనంలో స్పందన కలిగించగలిగారు కానీ.. ఓట్లేసి గెలిపిస్తే ఏదైనా చేయగలరన్న భరోసా ఇవ్వలేకపోయారు. ఇదే కేజ్రీవాల్ బలహీనత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీపైన జనంలో ఉన్న వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెరగలేదు. ఆ ఓట్లన్నీ కమలం వైపు పడ్డాయి. మోడీ హవాకు ఇది తోడైంది. బీజేపీ సీట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదపడింది.http://www.aptopnews.com/

Sunday 18 May 2014

గుజరాత్ మోడల్ గురికుదిరేనా..?

నూటా పాతిక కోట్ల భారతీయుల ఆశాకిరణం నరేంద్ర దామోదర దాస్ మోడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పగ్గాలందుకున్న ఈ చాయ్ వాలా ముందు భారీ లక్ష్యాలే ఉన్నాయి. భారత్ ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దాల్సిన బృహత్తరమైన బాధ్యత మొదటిది. స్వతంత్ర భారతదేశంలో ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇదే. ఇప్పటిదాకా ఇండిపెండెన్స్ కు ముందు పుట్టిన ప్రధానులను చూశాం. ఇప్పుడు 1947 తర్వాత అదీ ఇండియాలోనే జన్మించిన మోడీని చూస్తున్నాం. గుజరాత్ మోడల్ తో ఆయన సొంత రాష్ట్రంలో ఏదో మహాద్భుతం చేశారని జనం నమ్ముతున్నారు. అదే అభివృద్ధిని దేశమంతటికీ విస్తరిస్తారనీ ఆశిస్తున్నారు. 

కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు

బంగారు తెలంగాణా లక్ష్యంతో కోటి రతనాల వీణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్ తొలి సంతకం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా పదిహేను వేల కోట్లు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే తొలి సంతకం ఇదే ఫైలుపై చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారులు ఏకే గోయెల్, రేవీ రమణాచారి, రామచంద్రుడు, రామ్ లక్ష్మణ్ తదితరులు రైతు రుణ మాఫీ ఫైలును సిద్ధం చేస్తున్నారు. దీన్ని తెలంగాణా అధికార యంత్రాంగం ఫైనల్ చేసి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజుకు ఆయన ముందు పెట్టబోతోంది. ప్రస్తుతం తెలంగాణాలో వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు  24 వేల కోట్లకు పైమాటే. ఇందులో లక్షల రూపాయల లోపు రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేయనుంది. దీంతో 22  వేల మంది అన్నదాతలు లాభపడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతు రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయబోతున్నారు. తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్ హామీ అమల్లోకి వచ్చింది. ఇలా తొలి సంతకం హామీలు మన నేతల్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తున్నాయి.